ఆ మూవీ కోసమే అంటున్న నెటిజన్లు!

  • November 16, 2023 / 04:10 PM IST

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీశ్‌ తివారి హిందీలో ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించనుండగా.. సీత పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరిపిందని.. సానుకూలంగా స్పందించిందని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌. ఇందులో రావణుడి పాత్ర కోసం యశ్‌ను రంగంలోకి దించనున్నారని పచారం వినిపిస్తోంది. రామాయణం కోసం హీరోయిన్ సాయిపల్లవి ముంబాయి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి ముంబయిలో ఉన్నారంటూ తనతో దిగిన ఓ ఫొటోను అభిమాని షేర్‌ చేశారు. దీంతో త్వరలోనే రామాయణం సినిమా ప్రారంభం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది.

రామాయణం మూవీ కోసమే ముంబయికి మకాం మార్చినట్లు సమాచారం. దీంతో (Sai Pallavi) సాయిపల్లవి ఫొటో వైరల్ అవ్వడంతో మరోసారి రామాయణం మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. మూవీ కోసమే సాయిపల్లవి ముంబయి వెళ్లినట్లు ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక రామాయణం మూవీ విషయానికి వస్తే.. దీన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్‌. మూవీ రెగ్యులర్‌ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి భాగం షూటింగ్‌ నిర్వహించనున్నారట. శ్రీలంకలో భారీ సెట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్‌, మధు మంతెన నిర్మిస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus