కరోనా వల్ల…మా ఆవిడ ఏమి చెబితే అది చెయ్యాల్సి వస్తుంది..!

  • March 30, 2020 / 04:33 PM IST

కరోనా … ఇప్పుడు ప్రపంచమంతా చమటలు పట్టిస్తుంది. దీంతో ఇండియా వైడ్ లాక్ డౌన్ ప్రకటించారు ప్రధానమంత్రి మోడి. ఏప్రిల్ 15 వరకూ ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం … ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక దీని వల్ల చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు కూడా నిలిపివేశారు.

వేరే దేశాలకు ట్రిప్ లు వేసే పరిస్ధితి కూడా లేదు కాబట్టి మన టాలివుడ్ సెలబ్రిటీలు అంతా తమ ఇళ్లలోనే ఉంటూ… కుటుంబంతో సమయం గడుపుతున్నారు. అంతే కాదు ఇంట్లోని పనులన్నిటినీ వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ నటి, ‘జబర్దస్త్’ జడ్జ్ అయిన రోజా తన పిల్లల కోసం చికెన్ వండుతుంది. ఇక యాంకర్ ప్రదీప్ బెండకాయ ఫ్రై వండడం నేర్చుకుంటున్నట్టు తెలిపాడు. ఇక మన టాప్ కమెడియన్ అలీ… తన భార్య చెప్పే పనులు చేస్తున్నట్టు తెలిపాడు.

అలీ మాట్లాడుతూ…”‘ఇంట్లో మా ఆవిడ ఏం పని చెబితే అది చేస్తున్నాను. రోజూ కార్లను శుభ్రం చేయడంతో పాటు ఇంట్లో కూడా పనిచేస్తున్నాను. కూరగాయలు కట్ చేయడం, ఇల్లు శుభ్రపరచడం, వంట చేయడం వంటివి చేస్తున్నాను. మరికొంతసేపు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నా’ అంటూ తెలిపాడు.అంతే కాదు… అందుకు సంబందించిన కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus