Chiranjeevi: ఒకే ఫ్రేమ్ లో టాప్ డైరెక్టర్స్.. ఫోటో వైరల్!

  • July 29, 2021 / 11:08 AM IST

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, అగ్ర దర్శకులందరూ ఒకచోట కలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఫంక్షన్స్ లోనో లేక సెలబ్రిటీలు నిర్వహించే శుభకార్యాల్లోనో.. లేదంటే స్టార్స్ బర్త్ డే వేడుకల్లో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంటుంది. తాజాగా సింగిల్ ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అందరూ కనిపించారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించడం విశేషం. ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ వేడుకలను ఇండస్ట్రీ మిత్రులతో సహచరులతో కలిసి ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు దర్శకులు బి. గోపాల్, కొరటాల శివ, పరశురామ్, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ హాజరయ్యారు. అంతేకాకుండా.. కీర్తి సురేష్, కార్తీ, అల్లు అరవింద్, సోనూసూద్ లాంటి ప్రముఖులు ఈ వేడుకలో కనిపించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి టాలీవుడ్ దర్శకులంతా తీసుకున్న ఓ సెల్ఫీ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెహర్ రమేష్ క్లిక్ చేసిన ఈ ఫోటోలో స్టార్ డైరెక్టర్లందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ రకరకాలుగా స్పందింస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ ఫోటోలో చిరు లుక్ చూసి.. ఈ పిక్ ఇప్పటిది కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus