మరో టాలీవుడ్ బడా నిర్మాత కొడుకు .. ఎంట్రీ?

  • February 11, 2020 / 08:07 PM IST

అవును మరో బడా నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఆ బడా నిర్మాత మరెవరో కాదు డి.వి.వి దానయ్య. ప్రస్తుతం ఈయన రాజమౌళి డైరెక్షన్లో చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ను నిర్మిస్తున్నాడు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దానయ్య. ఇంటర్నేషనల్ వైడ్.. సుమారు 10 భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మాత దానయ్య కొడుకు కళ్యాణ్… ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట.

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ డైరెక్ట్ చేయబోతున్నాడట. గతంలో శ్రీవాస్ ‘లౌక్యం’ ‘లక్ష్యం’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. అయితే బాలయ్యతో తీసిన ‘డిక్టేటర్’ .. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తీసిన ‘సాక్ష్యం’ చిత్రాలు ప్లాప్ అవ్వడంతో కొన్నాళ్ళ నుండీ ఈయన మరే చిత్రాన్ని తెరకెక్కించలేదు. ఇప్పుడు మళ్ళీ డి.వి.వి.దానయ్య కొడుకుతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ‘నేనే రాజు నేనే మంత్రి’ ‘ఎం.ఎల్.ఏ’ వంటి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించిన భరత్ చౌదరి నిర్మించబోతున్నట్టు సమాచారం.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus