మహేష్ బాబు (Mahesh Babu) , త్రిష (Trisha).. ఈ పేర్లు చెప్పగానే అందరికీ పూరీ, పార్ధు పాత్రలు గుర్తుకొస్తాయి. ‘అతడు’ (Athadu) సినిమాలో వీళ్ళు ఆ పాత్రల్లో ఒదిగిపోయారు అని చెప్పాలి. ‘అతడు’ సినిమాకి వీళ్ళ పెయిర్ కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఆ తర్వాత వీళ్ళు ‘సైనికుడు’ (Sainikudu) సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా.. మహేష్ (Mahesh Babu), త్రిష పెయిర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల త్రిష.. మహేష్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
త్రిష (Trisha) మాట్లాడుతూ… “మహేష్ బాబు (Mahesh Babu) ఫెంటాస్టిక్ యాక్టర్. అందులో డౌటే లేదు. నాకు ఇష్టమైన అతి తక్కువ మంది నటుల్లో మహేష్ బాబు ఒకరు. అతనికి పెద్ద స్టార్ అనే ఫీలింగ్ ఉండదు. చిన్న నటీనటులు అందరితో ఇట్టే కలిసిపోతారు. అందరిపై జోకులు వేస్తూ.. సీరియస్ గా ఉండే సెట్స్ వాతావరణాన్ని మార్చేస్తూ ఉంటారు. అది అందరి వల్ల కాదు. మహేష్ బాబు బాగా హార్డ్ వర్క్ చేస్తారు.
అతని సీన్ లేకపోయినా మానిటర్ వద్దే కూర్చుంటారు. పర్ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు. వ్యానిటీ వ్యాన్ కి వెళ్ళిన సందర్భాలు నేను ఎక్కువ చూడలేదు. వేకువజామునే సెట్స్ కి వచ్చేసేవారు. రాత్రి 10 :30 అయినా సెట్స్ నుండి వెళ్లేవారు కాదు. అందుకే నాకు మహేష్ తో పని చేస్తున్నప్పుడు ఆ గిల్టీ ఉండేది” అంటూ చెప్పుకొచ్చింది.