అలా సెట్ చేసిన మాటల మాంత్రికుడు

  • December 28, 2020 / 11:12 AM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ మొదట్లో రైటర్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలకు మాటలు కథ అంధించిన ఈ రైటర్ దర్శకుడిగా మారిన తరువాత వేరే సినిమాలకు పెద్దగా పని చేయడం లేదు. చివరగా జై చిరంజీవ సినిమాకి స్టోరీ డైలాగ్స్ రాసిన అనంతరం మళ్ళీ ఏ సినిమాకు తన పెన్నును ఉపయోగించలేదు. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ ఒక యువ హీరో కోసం స్టోరీ సెట్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.

అలాగే తన దగ్గర ఇదివరకు సహాయక దర్శకుడిగా పని చేసిన వెంకీ కుడుముల చేత ఆ కథను తెరపైకి తీసుకొస్తారని టాక్ వస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో నిర్మాత స్రవంతి రవికిశోర్ తో ఒక సినిమాను చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళబ్బాయి రామ్ పోతినేనికి సరిపడా కథను రెడీ చేయమని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉండడం వల్ల దర్శకత్వ బాధ్యతను శిష్యుడికి అప్పగించినట్లు సమాచారం.

వెంకీ కుడుములు ఇదివరకే ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని స్టార్ హీరోలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ త్రివిక్రమ్ కోరిక మేరకు ఆయన సెట్ చేసిన కథ కోసం తన కథను పక్కన పెట్టాడట వెంకీ. రామ్ కూడా అతని డైరెక్షన్ లో చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus