Guntur Kaaram: సినిమాకు బ్రేక్‌లు మీద బ్రేక్‌లు.. ఈలోపు కథ విషయంలో లీక్‌లు.. ఏంటిది?

  • July 24, 2023 / 03:47 PM IST

ఓ సినిమాకు ఎన్ని కథలు ఉంటాయి? ఇదే ప్రశ్న.. ఏ సినిమాకైనా ఒకటే కథ ఉంటుంది. ఒకవేళ ఆ కథ వద్దనుకుంటే మార్చేసి కొత్తది తీసుకుంటారు? అప్పుడు కూడా ఒకటే కథ అని అంటరా? అవును మీరు అన్నది నిజమే.. అయితే మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో మాత్రం రోజుకో కథ వినిపిస్తోంది, రోజుకో పాయింట్‌ బయటకు వస్తోంది. దీంతో అసలు కథేంటి, ఏ లీక్‌ నిజమైనది అనే ప్రశ్న మొదలైంది.

తాజాగా వస్తున్న లీక్‌ ప్రకారం అయితే ఈ సినిమాలో (Guntur Kaaram) ‘మహేష్‌ ఇరువురి భామల మధ్యలలో స్వామి…’ అనే కాన్సెప్ట్‌లో ఉంటాడు అంటున్నారు.‘గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. సెకండ్‌ హీరోయిన్‌గా వచ్చిన శ్రీలీల ఫస్ట్‌ హీరోయిన్‌ అయిపోగా, రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదురిని తీసుకున్నారు. మామూలుగా అయితే త్రివిక్రమ్‌ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌కి అంత వాల్యూ ఉండదు. అంటే ఫస్ట్‌ హీరోయిన్‌తో పోల్చినప్పుడు అన్నమాట.అయితే ఈ సినిమాలో ఇద్దరికీ బలమైన, సమానమైన పాత్రలు అంటున్నారు.

ఆ విషయం పక్కనపెడితే.. ఆ ఇద్దరి మధ్య మహేష్‌ ఉండటమే కథ అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి ఇద్దరు సిస్టర్స్‌గా నటిస్తున్నారట. ఇద్దరికీ తండ్రి ఒకరు అయినా, తల్లులు వేరు అట. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుందని, వీరిద్దరి మధ్య మహేష్ పాత్ర ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని సమాచారం. ఇక ఇదంతా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో నడుస్తుందట. అలాగే సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైల్‌గా ఉంటుందట. దీంతో ఈ సినిమా గ్లామర్‌ పాళ్లు బలంగా ఉంటాయి అని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే, ఓవైపు సినిమా గురించి ఇలా లీక్‌లు వస్తుంటే.. మరోవైపు సినిమా షూటింగ్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి మహేష్‌ విహారయాత్రకు వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి షూటింగ్‌ మొదలుపెడతాడట. ఈలోపు త్రివిక్రమ్‌ ‘బ్రో’ రిలీజ్‌ పనులు చూసుకుంటున్నారట.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus