బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేని ‘ఉడ్తా పంజాబ్’..!

  • June 20, 2016 / 11:40 AM IST

సెన్సార్ బోర్డుతో వివాదాల అనంతరం బాంబే హైకోర్టు ఆదేశాలతో విడుదలైన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టలేకపోయిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజు కలెక్షన్ల తో నిరాశలో ఉన్నారట. సెన్సార్ బోర్డు వివాదంతో ఈ చిత్రానికి కావలసినంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చినప్పటికీ, అదే ఈ చిత్రానికి మైనస్ అయ్యిందని అంటున్నారు.

‘ఈ చిత్ర ఓపెనింగ్ వసూలు యావరేజ్ గా ఉన్నాయి. ఈ చిత్రం మొదటి రోజు రూ.8 లేదా రూ.9కోట్లు వసూలు చేసి ఉంటుంది. వివాదంతో ఈ చిత్రాన్ని వీక్షించడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేద’ని ఓ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని వీక్షించిన వారు మాత్రం.. చిత్రంలో అలియా, షాహిద్ కపూర్, కరీనా కపూర్, దల్జీత్ ల నటన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. డ్రగ్స్ కాంట్రవర్సీ నేపధ్యంలో అభిషేక్ చౌబే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫాంటోన్ ఫిల్మ్స్, బాలాజి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags