నాతో రెండో మూవీ చేయడానికి హీరోలు ఇష్టపడరు : బన్నీవాసు

  • March 17, 2021 / 07:58 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు వైష్ణవ్ తేజ్. గత నెలలో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా వైష్ణవ్ చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.

అయితే శుక్రవారం రోజు విడుదల కాబోతున్న చావు కబురు చల్లగా సినిమాలో నటించే ఛాన్స్ మొదట వైష్ణవ్ తేజ్ కు వచ్చిందట. ప్రముఖ నిర్మాత బన్నీవాసు చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ షూటింగ్ పూర్తయ్యేవరకు మరో సినిమాకు కమిట్ కానని చెప్పడంతో ఆ సినిమాలో నటించే ఛాన్స్ కార్తికేయకు దక్కింది. వైష్ణవ్ తేజ్ ఈ సినిమాను వదులుకుని తప్పు చేశారో రైట్ చేశారో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

బన్నీవాసు ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ డైరెక్టర్ కౌశిక్ సూచనల మేరకు ఈ సినిమాలో కార్తికేయను తీసుకున్నామని తెలిపారు. తన నిర్మాణంలో తెరకెక్కే సినిమాలు పూర్తి కావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని సినిమా ఫస్ట్ కాపీ చూసిన తరువాత అవసరమైతే రీషూట్ చేస్తామని బన్నీవాసు అన్నారు. గీతా గోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకు సైతం ఏడాదికి పైగా సమయం పట్టిందని.. ఆ కారణం వల్లే నాతో రెండో సినిమా తీయడానికి హీరోలు ఇష్టపడరేమో అని బన్నీవాసు నవ్వుతూ చెప్పారు. క్లాస్ కథను మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు నిర్మిస్తానని.. ఓటీటీలకు సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా అమ్మడం వల్ల పెద్దగా లాభం ఉండదని బన్నీవాస్ తెలిపారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus