‘శాకినీ ఢాకినీ’ కి ఆ ఇద్దరి భామలను ఫైనల్ అయినట్టే…!

  • May 6, 2021 / 05:26 PM IST

హీరో నిఖిల్ తో ‘స్వామి రా రా’ వంటి హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సుధీర్ వర్మ ఆ తరువాత సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ‘దోచేయ్’ ‘కేశవ’ ‘రణరంగం’ వంటి సినిమాలను తెరకెక్కించాడు కానీ హిట్టు కొట్టలేకపోయాడు. అయితే త్వరలో ఇతను ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ‘సురేశ్ ప్రొడక్షన్స్’ బ్యానర్ తో కలిసి సునీతా తాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

ఒరిజినల్ లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు కాబట్టి.. తెలుగులో ఆ పాత్రలకు ఎవరిని ఎంపిక చేసుకుంటారా? డిస్కషన్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెజీనా కసాండ్రా, నివేదా థామస్ వంటి భామలను ఫైనల్ చేసినట్లు వినికిడి. ఈ చిత్రానికి ‘షాకినీ ఢాకినీ’ అనే పేరుని కూడా ఖరారు చేసినట్టు సమాచారం.ఇద్దరు లేడీ పోలీసులు కొన్ని కారణాల వల్ల ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. చివరికి వారి భారి నుండీ ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథని తెలుస్తుంది.

ఈ పాత్రలకు వీరిద్దరూ సరైన సెలక్షన్ అనే చెప్పాలి. ఈ మధ్యన వీరిద్దరూ వరుసగా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.’వకీల్ సాబ్’ లో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది నివేదా. ఇక ‘ఆచార్య’ లో చిరుతో కలిసి స్టెప్పులు వేయనుంది రెజీనా.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus