పెద్ద బాంబ్ పేల్చిన పవన్ నిర్మాత….!

  • May 5, 2020 / 04:55 PM IST

నిజానికి ఈ లాక్ డౌన్ లేకుండా పరిస్థితి అంతా నార్మల్ గా ఉండి ఉంటే… మే 15 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యి ఉండేది. కానీ మహమ్మారి దెబ్బకు ప్లాన్ మొత్తం అప్సెట్ అయ్యింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు పవన్ నిర్మాత పెద్ద బాంబ్ పేల్చాడు. అవును దిల్ రాజు తో పాటు బోణి కపూర్ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి ఏ అప్డేట్ అయినా సరే లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ రెవీల్ చెయ్యొద్దు అని చెప్పాడట.

ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. నిజానికి మార్చి 19 నుండీ షూటింగ్ లు అన్నీ బంద్ అయ్యాయి. మొన్నటికి మొన్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్.. ‘షూటింగ్ అప్పుడే 80 శాతం పూర్తయ్యింది’ అని చెప్పాడు. హీరోయిన్ శృతి హాసన్ పార్ట్ పూర్తయితే… షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టే అని కూడా తెలిపాడు. అంటే టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది.

కానీ ఇప్పుడు సడన్ గా బోణి కపూర్ ఇలా ప్రకటించడంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోణి కపూర్ మాటల్ని బట్టి చూస్తే డైరెక్టర్ చెప్పినంత రేంజ్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యి ఉండదు. ఒకవేళ పూర్తయినా నిర్మాతలు .. అవుట్పుట్ తో సంతృప్తి చెంది ఉండరు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానం కనుక నిజమయితే ‘వకీల్ సాబ్’ రిలీజ్ దగ్గర్లో కాదు కదా… ఈ ఏడాదే ఉండకపోవచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus