‘వీరసింహారెడ్డి’ లో హైలెట్ ట్విస్ట్.. కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారా?

  • December 30, 2022 / 01:12 PM IST

2023 సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో పాటు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది. రెండు సినిమాల పాటలకు, టీజర్లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. గతంలో వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి పోటీపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈసారి పోటీ అని చెప్పలేము కానీ.. ఎవరి ఇమేజ్ కు తగ్గట్టు వాళ్ళ సినిమాలు ఆడతాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది పక్కా మాస్ సినిమా అని జనాలు ఫిక్స్ అయ్యారు.

గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. వీరి గత సినిమాలు ‘క్రాక్’ ‘అఖండ’ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాబట్టి ఈ కాంబినేషన్లో వచ్చే ‘వీర సింహారెడ్డి’ పై మాస్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీలో సెంటిమెంట్ కూడా గ‌ట్టిగానే ఉంటుందని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌… బాల‌య్య కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుందట.

వీరి కాంబినేషన్లో వచ్చే సెంటింమెంట్ సీన్లు కంటిత‌డి పెట్టించేలా ఉంటాయని వినికిడి. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేట‌ర్ల‌కు వ‌స్తారు కాబట్టి… సెంటిమెంట్ సన్నివేశాలు వారిని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. బాల‌య్య త‌ర‌వాత ఈ సినిమాలో హైలెట్ రోల్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ దే అని తెలుస్తుంది. ఓ ట్విస్ట్ కూడా హైలెట్ గా నిలుస్తుందట.

ఆ ట్విస్ట్ ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకొంటారు అనే భయం చిత్ర బృందంలో ఉందట. చిత్ర బృందాన్ని అంతలా భయపెట్టే ట్విస్ట్ ఏమై ఉంటుందా అని అభిమానులు కూడా కలవరపడుతున్నారు. ఏది ఏమైనా ఇది ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి బొమ్మ కాబట్టి మినిమమ్ గ్యారంటీ అని చెప్పొచ్చు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus