Varun Tej: అక్క రైట్‌ వేలో ఉంది… ‘పరువు’ గురించి వరుణ్‌ తేజ్ ఇంకా ఏమన్నాడంటే?

  • June 14, 2024 / 01:19 PM IST

సినిమాల రేంజిలో వెబ్‌ సిరీస్‌లు సిద్ధం చేస్తోంది టాలీవుడ్‌. ప్రముఖ నటులతోనే ఆ సిరీస్‌లు రూపొందుతున్నాయి. అలా రూపొందిన ఓ వెబ్‌ సిరీస్‌ ‘పరువు’. నాగబాబు, అగస్త్య, నివేదా పేతురాజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సిరీస్‌ ఇది. ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఆ వేదిక మీద వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌లో తండ్రి నాగబాబుని చూస్తే భయమేసిందని అన్నారు. విలన్‌ పాత్రలో నాగబాబు ఒదిగిపోయారని చెప్పిన వరుణ్‌.

ఫస్ట్‌ ఎపిసోడ్‌ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి చూశానని, చాలా బాగుందని అన్నాడు. డైరెక్టర్‌ పవన్‌ సాధినేని ‘షో రన్నర్‌’గా ఈ సిరీస్‌ అదిరిపోయేలా సిద్ధ చేశారని చెప్పాడు వరుణ్‌. సుస్మిత అక్క తనదైన దారిలో ప్రయాణిస్తోందన్న వరుణ్‌.. ఆమెను చూస్తే గర్వంగా ఉంటుందన్నాడు. హనీ అక్క కోసం ఇక్కడికి వచ్చానని చెప్పిన వరుణ్‌.. అక్క ఎప్పుడూ మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని అవకాశాలు అడగలేదు అని అన్నాడు.

పవన్ సాధినేని షో రన్నర్ మాత్రమే కాదు క్రైసిస్ మేనేజర్‌గానూ వ్యవహరించారని నిర్మాతల్లో ఒకరైన సుస్మిత చెప్పారు. ఒక్కోసారి మా నాగబాబు బాబాయ్ పర్ఫామెన్స్ చూసి భయం వేసింది అని అన్నారామె. ఇలాంటి ప్రాజెక్ట్‌లను తీసుకుంటూ సుష్మిత ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారుని రచయిత బీవీఎస్‌ రవి చెప్పారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన సిరీస్ ఇది. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకులు.

ఇక సినిమాల సంగతికి వస్తే.. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో ఇప్పటికే ఓ సినిమా నిర్మించారు. ఇదే బ్యానర్‌లో చిరంజీవితో సినిమా రావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టు ముందుకొస్తోంది అంటున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలసి చిరంజీవితో సినిమా చేస్తారట. త్వరలో అనౌన్స్‌మెంట్‌ అని చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus