ఆ సిన్సియర్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ చిత్రం..!

  • March 6, 2018 / 09:21 AM IST

“ఫిదా, తొలిప్రేమ” చిత్రాలతో వరుస హిట్స్ సొంతం చేసుకొని ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం ప్రిపరేషన్ లో ఉన్న వరుణ్ తేజ్ (varun tej) అప్పుడే మరో దర్శకుడ్ని ఒకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం “ఘాజీ” దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పేస్ ఫిలిమ్ చేసేందుకు సన్నద్ధమవుతున్న వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత “అప్పట్లో ఒకడుండేవాడు” ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించేందుకు పచ్చ జెండా ఉపాడట. “అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు” చిత్రాలు హిట్ అవ్వకపోయినా సదరు చిత్రాల కథలను, కథలోని పాత్రలను తీర్చిదిద్దిన విధానానికి సాగర్ చంద్రను ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకొన్నారు.

ఆ నమ్మకంతోనే సాగర్ చెప్పిన కథ నచ్చి సినిమా సైన్ చేశాడట వరుణ్. తనకు కమర్షియల్ సినిమాల కంటే డిఫరెంట్ మూవీస్ చేయడమే తన కెరీర్ కు మంచిదని భావించిన వరుణ్ ఇలా వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకుంటున్నాడు. ఇకపోతే.. వరుణ్ తేజ్ తన తాజా చిత్రమైన స్పేస్ ఎంటర్ టైనర్ కోసం ప్రస్తుతం గ్రావిటీ ట్రైయినింగ్ తీసుకోబోతున్నాడు. తెలుగులో తెరకెక్కబోయే మొట్టమొదటి స్పేస్ ఫిలిమ్ కావడంతో హాలీవుడ్ టెక్నాలిజీతో సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus