Veera Simha Reddy: ఫ్యాన్స్ కు గోపీచంద్ మలినేని గుడ్ న్యూస్.. డైలాగ్స్ చెబుతారంటూ?

  • December 26, 2022 / 11:32 AM IST

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి సాంగ్ విడుదల కాగా ఒక్కరోజులో ఈ సాంగ్ కు ఏకంగా 5.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ తో పోలిస్తే ఈ సాంగ్ కు మరింత ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్యతో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్పులు అద్భుతంగా వేయించారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు. జనవరి నెల ఆరో తేదీన ఒంగోలులో వీరసింహారెడ్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో బాలకృష్ణ మాస్ డైలాగ్స్ చెబుతారని గోపీచంద్ మలినేని వెల్లడించగా

ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లోనే వీరసింహా రెడ్డి ట్రైలర్ రిలీజ్ కానుండగా ట్రైలర్ రిలీజైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హనీ రోజ్, శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ పవర్ ను చూపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా మాస్ కథాంశాలతో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus