Venkaiah Naidu, Chiranjeevi: చిరంజీవి ఎందరికో ఆదర్శం!: వెంకయ్య నాయుడు

  • February 5, 2024 / 05:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి పై తాజాగా వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి కళామతల్లికి మూడో కన్ను అంటూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా చిరంజీవి గురించి వెంకయ్య నాయుడు గురించి ఇలాంటి కామెంట్స్ చేయడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే.. ఇటీవల భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పద్మ అవార్డులను అందుకున్నటువంటి తెలుగు వారికి తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.

శిల్పకళ వేదికలో నిన్న పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో గౌరవ మర్యాదలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి వెంకయ్య నాయుడుతో పాటు ఇతర పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాకు మొదటి నుంచి కూడా అవార్డులు అంటే పెద్దగా ఆసక్తి లేదు కానీ పద్మ విభూషణ్ అవార్డు మోడీ ప్రభుత్వం ప్రకటించడంతో ఆయనపై గౌరవంతోనే నేను ఈ అవార్డు అందుకున్నానని తెలిపారు. ఇక నా మిత్రుడు చిరంజీవికి కూడా ఇలాంటి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఈయన అభినందనలు తెలిపారు. ఇక తాను (Chiranjeevi) చిరంజీవి గురించి గతంలో ఒక మాట చెప్పాను.

ఇప్పుడు కూడా చెబుతున్నాను తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళు లాంటి వారు అయితే చిరంజీవి మూడో కన్ను లాంటివారని తెలిపారు. ఈయన పట్టుదల కృషి తనని ఈ స్థాయికి తీసుకువచ్చాయని తెలిపారు. అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం నటించడం మరో ఎత్తు. ఈ విషయంలో చిరంజీవిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనీ ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus