సినిమాల్లో కాస్త ఫేమ్ రాగానే మేం తోపులం, మేమేం చేసినా నడుస్తుంది. మాకు ప్రేక్షకులు, ప్రజలు బ్రహ్మరథం పడతారు అని అనుకుంటూ ఉంటారు సినిమా పరిశ్రమలో. అసలు సంగతి వాళ్లు ‘సినిమా’ అనే ట్యాగ్లైన్ తీసిన జనాల మధ్యకు వెళ్తే తెలుస్తుంది అంటారు. అంటే సాధారణ మనిషిలానో, ఏ రాజకీయ నాయకుడిగానో వెళ్తే తెలుస్తుంది అని అంటారు. ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉందో, లేక జీవితం నేర్పిన విషయాలో కానీ ఓ హీరో ప్రాక్టికల్ ఆన్సర్ ఇచ్చాడు.
ఇప్పుడు ఆ విషయాలు వైరల్గా మారాయి. తన కొత్త సినిమా ‘మార్గన్’ (Maargan) ప్రచారం కోసం హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) గత కొన్ని రోజులుగా చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీ గురించి రియాక్టయ్యారు. సినిమాల్లోకి వచ్చి మంచి పేరు, పరపతి సంపాదించుకున్నారు కదా.. నెక్స్ట్ పాలిటిక్సేనా అని అడిగితే రాజకీయాలపై తనకు పెద్దగా అవగాహన లేదని తేల్చేశాడు.
అంతేకాదు ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాలేమని స్పష్టం చేశాడు విజయ్ ఆంటోని (Vijay Antony). పాలిటిక్స్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నటీనటులు ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే రూల్ ఏమీ లేదు కదా అని ప్రశ్నించాడు విజయ్ ఆంటోని (Vijay Antony). ఒకవేళ సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా పాలిటిక్స్లో అడుగుపెట్టినా.. వారికి పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు ఉండాలి. అలా ఉన్నప్పుడే మాత్రమే రాజకీయాల్లో అధికారంలోకి రాగలుగుతారు.
ఇంకా చెప్పాలంటే నాకు రాజకీయాలపై అవగాహన లేదు. అందుకే ఫేమ్ ఉందని రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి లేదు. అది కరెక్ట్ కూడా కాదు. పాలిటిక్స్లోకి రాగానే ముందు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి అని ప్రాక్టికల్గా మాట్లాడాడు విజయ్ ఆంటోని (Vijay Antony). ఇక ‘మార్గన్’ సినిమా విషయానికొస్తే.. విజయ్ ఆంటోనీ హీరోగా లియో జాన్పాల్ తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను జూన్ 27న విడుదల చేస్తున్నారు.