Vijay Devarakonda, Ananya Panday: హీరోయిన్ ఒడిలో పడుకొని విజయ్ జర్నీ!

  • July 29, 2022 / 08:03 PM IST

రౌడీహీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘లైగర్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోట్ చేస్తుంది. విజయ్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. అందుకే విజయ్ కూడా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. తన లాంఛింగ్ కి తగ్గట్లుగానే బాలీవుడ్ లో ప్రచారం చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఎంట్రీ ఇచ్చిన విజయ్..

ఇప్పుడు ఆమెతో కలిసి ముంబై లోకల్ ట్రైన్ లో సందడి చేశారు. ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడానికి లోకల్ ట్రైన్ ఎక్కినా ఈ జోడీ అభిమానులను బాగా ఇంప్రెస్ చేశారు. బాగా అలసిపోయిన విజయ్.. అనన్య ఒడిలో పడుకొని జర్నీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. స్లమ్ లో పెరిగే ఓ కుర్రాడు ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎలా ఎదిగాడనేదే ఈ సినిమా. మాస్ అండ్ యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా విజయ్ ఈ సినిమాను రూపొందించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ‘లైగర్’ టీమ్. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కాసేపటి క్రితమే ‘వాట్ లగా దేంగే’ అంటూ సాగే మ్యూజికల్ వీడియోను విడుదల చేశారు. ఇది మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకుపోతుంది.

1

2

3

4

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus