విజయ్ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి జరగబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి ఎంగేజ్మెంట్నే ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు కాబట్టి.. పెళ్లి వార్తను ఎక్కడా కన్ఫామ్ అని చెప్పలేని పరిస్థితి ఉండేది. అయితే పెళ్లి పిలుపులు మొదలైపోవడం, రిసెప్షన్ ఇన్విటేషన్ బయటకు రావడంతో ‘లీకులు చేయొద్దు’ అంటూ టీమ్ ప్రకటన ఇచ్చింది. ఆ లెక్కన పెళ్లి ఇంచుమించు అధికారికం అయింది. ఇప్పుడు విజయ్ – రష్మిక అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టు పెట్టారు.
ఆదివారం రాత్రి విజయ్ దేవరకొండ, రష్మిక మందన తొలిసారి తమ వివాహం గురించి స్పందించారు. తమ వివాహానికి విరోష్ అనే పేరు పెట్టారు. ఈ పేరు ప్రేమతో తమ అభిమానులు పెట్టారని, వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ అదే పేరుని కొనసాగిస్తున్నట్లు ఇద్దరూ ఆ నోట్లో రాసుకొచ్చారు. మేం మా కోసం ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకునేలోపు అభిమానులు స్పందించి ఆ పనిని పూర్తి చేస్తున్నారు. పెళ్లి విషయంలోనూ విరోష్ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. అందుకే మేం మా పెళ్లి వేడుకకి ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.
మమ్మల్ని ఇంతలా ప్రేమాభిమానులతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. అభిమానులు ఎప్పుడూ మాలో ఒక భాగం అని కూడా రాసుకొచ్చారు. ఈ నెల 26న విరోష్ ఏడడుగులు వేయనున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పుర్ ఈ వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్లో మార్చి 4న వివాహ విందు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్ కృష్ణలో ఈ వేడుక ఉంటుందని ఆ మధ్య లీకైన రిసెప్షన్ ఇన్విటేషన్లో కనిపించింది. పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బంధుమిత్రులు హాజరు కానున్నారు. రిసెప్షన్కి తెలుగు సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది.
Vijay – Rashmika.. కలిపితే ViRash అవ్వాలి. మరి ViRosh ఎలా అయిందో.. దీనిని అభిమానులు ఎప్పుడు, ఎలా సూచించారో తెలియదు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి హ్యాష్ట్యాగ్ చూసింది లేదు. పోన్లెండి విజయ్ అయితే పెళ్లి ముచ్చట చెప్పాడుగా ఫైనల్లీ!
#VIROSH pic.twitter.com/sbCDsOsMOk
— Filmy Focus (@FilmyFocus) February 22, 2026