మరో పిజ్జా పట్టుకొస్తున్న విజయ్ సేతుపతి

  • November 5, 2016 / 07:51 AM IST

తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా’ తెలుగులోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. హారర్ – థ్రిల్లర్ గా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాతోనే తొలిసారి విజయ్ సేతుపతి తెలుగు తెరపై దర్శనమిచ్చాడు. తర్వాత పిజ్జా కి సీక్వెల్ గా విల్లా అనే సినిమా వచ్చినా హీరోతో పాటు దర్శకుడు మారిపోయారు. అయితే తొలి హిట్ ఇచ్చిన సినిమా పేరుని మాత్రం ఈ హీరో వదులుకోలేకపోతున్నాడు.

విజయ్‌ సేతుపతి నటించిన తాజా తమిళ చిత్రం ‘పురియత్‌ పుధీర్‌’ తెలుగులోనూ విడుదల కానుంది. డి.వెంకటేష్‌ ఈ చిత్ర అనువాద హక్కుల్ని సొంతం చేసుకున్నారు. గాయత్రి కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘పిజ్జా 2’గా విడుదల కానుంది. పిజ్జా హీరో అన్న దాన్ని క్యాష్ చేసుకునేందుకే ఈ టైటిల్ ఖరారు చేశారట. ఇదీ థ్రిల్లర్ కథేనని సమాచారం. అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ముఠాకి సంబంధించిన కథతో తెరకెక్కించారట. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు మొదలెట్టనున్నారు. దీంతోపాటు విజయ్ నటించిన ‘ధర్మదురై’ కూడా ‘డాక్టర్ ధర్మరాజు ఎంబిబిఎస్’ పేరుతో తెలుగులోకి రానుంది.

https://www.youtube.com/watch?v=9MPN4LH928M

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus