విశాల్ హీరో కాదు విలన్’ అంటూ షాకింగ్ కామెంట్స్..!

  • July 7, 2020 / 08:37 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్నవాడే.నిజానికి విశాల్ తెలుగువాడే.. అయినప్పటికీ అతని కుటుంబం తమిళంలో సెటిల్ అయ్యారు. అక్కడి సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విశాల్. నడిగర్ సంగం అధ్యక్షుడుగా కూడా ఎదిగాడు విశాల్. అయితే విశాల్ మొదటి నుండీ ఎన్నో వివాదాలు ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ‘ఒక తెలుగు వాడు అక్కడి నిర్మాతలను లీడ్ చేయడమేంటి’ అంటూ ఎంతోమంది చేసిన విమర్శలను ఎదుర్కొన్నాడు.

అంతేనా.. అతన్ని అరెస్ట్ చేయించారు కూడా.! అది పక్కన పెడితే రాధికా శరత్ కుమార్, నటి వరలక్ష్మీ వంటి నటీమణులు కూడా ఇతన్ని విమర్శిస్తూ ఎన్నో కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవల విశాల్ పై ఓ మహిళ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయని చెప్పాలి. విశాల్ ఆఫీస్ లో రమ్య అనే మహిళ గత 6 ఏళ్ళ నుండీ పనిచేస్తుందట.అయితే ఈమె.. విశాల్ కంపెనీ ని ఈ 6 ఏళ్ళలో.. 45 లక్షల వరకూ చీట్ చేసిందట.

ఈ విషయమై విశాల్ మేనేజర్ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రమ్య పై కేసు పెట్టినందుకు గాను ఆమె కూడా సీరియస్ అయ్యి… విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె మాట్లాడుతూ.. “హీరోగా రాణిస్తున్న విశాల్ నిజానికి పెద్ద విలన్. నేను చూస్తుండగానే ఎన్నో తప్పులు చేశాడు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అన్నీ బయటపెడతాను. నన్ను ఇన్నాళ్ళు బెదిరిస్తుండడం వల్ల నేను ఆ విషయాలను బయటపెట్టలేదు. ఎంతైనా మహిళను కదా..! కానీ నా పై లేని పోనీ ఆరోపణలు వేసినందుకు గాను.. కచ్చితంగా త్వరలోనే విశాల్ అసలు రూపాన్ని అందరూ తెలుసుకునేలా చేస్తాను” అంటూ సవాలు విసిరింది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus