Vivaha Bhojanambu: ‘వివాహ భోజనంబు’కి భారీ లాభాలు!

  • August 30, 2021 / 10:35 AM IST

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు నటిస్తూనే.. నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కి కూడా ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఇటీవల కమెడియన్ సత్యను హీరోగా పెట్టి ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను నిర్మించారు సందీప్ కిషన్. ఇటీవలే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. నిర్మాతగా సందీప్ కి ఈ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చిందని తెలుస్తోంది.

ఈ సినిమాను సోనీ సంస్థకు రూ.1.5 కోట్లకు అమ్మేశారు సందీప్ కిషన్. దాంతో పాటు శాటిలైట్ రైట్స్, ఇతర హక్కుల రూపంలో మరో రూ.1.5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే రూ.3 కోట్ల బిజినెస్ జరిగిందన్నమాట. సినిమా మాత్రం కోటి రూపాయల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. వడ్డీలు, ప్రమోషన్స్ అన్నీ కలిపి మరో యాభై లక్షల వరకు వేసుకున్నా.. మరో కోటిన్నర లాభమే. సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో తన హోటల్ కి కూడా ప్రచారం బాగానే వచ్చింది. మొత్తానికి నిర్మాతగా సందీప్ లాభాల రుచి చూసేసాడు. ఇదే జోరులో తన బ్యానర్ లో మరో రెండు సినిమాలను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. అందులో ఒక సినిమాలో తనే హీరోగా నటిస్తున్నాడు. మరో సినిమా బయట హీరోతో తీస్తున్నాడు. ఈ సినిమాలు కూడా ఓటీటీ కోసమే అని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus