Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?
- March 24, 2026 / 04:58 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్ లో మాస్ & కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ వి.వి. వినాయక్. ఆది సినిమాతో డైరెక్టర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి, తొలి చిత్రంతోనే రికార్డులను తిరగరాశారు ఆయన. ఆ తరువాత ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు చిత్రాలను డైరెక్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు వినాయక్. అయితే, వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రెండు విభిన్నపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అదుర్స్’. ఈ చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ చిత్రం సీక్వెల్ అదుర్స్ 2 పై ప్రశ్న ఎదురవగా, దర్శకుడు వినాయక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.
Adhurs
ఇంతకీ డైరెక్టర్ వినాయక్ ఏమన్నారంటే… ‘అదుర్స్’ అనేది ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అని, ఆ చిత్రం యొక్క ఎండింగ్ క్లైమాక్స్ లోనే ఇచ్చేశాం అని అన్నారు. సీక్వెల్ తీయటానికి అక్కడ సరైన కనెక్టింగ్ పాయింట్ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కావాలని మనం సీక్వెల్ తీయటానికి లేని పాయింట్ ని తీసుకువచ్చి ప్రయత్నించినా అది సెట్ అవ్వదు అని తెలిపారు. కొన్ని సినిమాలు ఇచ్చిన అనుభూతిని ఒక మధుర జ్ఞాపకంలా అలానే భద్రంగా మనసులో ఉంచుకోవాలి కానీ, దాన్ని పాడు చేసుకోవద్దు అని కుండ బద్దలు కొట్టారు. దీంతో భవిష్యత్ లో ఇక అదుర్స్ సీక్వెల్ ఉండదు అని చెప్పకనే చెప్పారు వినాయక్.

అదుర్స్ సినిమా కి సంబంధించి ఎన్టీఆర్ , బ్రహ్మానందం కాంబోలో చేసిన కామెడీ ట్రాక్ ఇప్పటికి మీమ్ పేజీ టెంప్లేట్ గా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. కాగా ఈ మూవీలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు.
















