Aha Naa Pellanta: అరుదైన గౌరవం దక్కించుకున్న ‘తమడా మీడియా’ సంస్థ..!

  • December 22, 2022 / 01:56 PM IST

నవంబర్ 17 నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్ షిప్ ను సాధించిన సిరీస్ గా ‘అహ నా పెళ్ళంట’ నిలిచింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్‌ గా రూపొందింది. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ లో హర్ష వర్ధన్, ఆమని కీలక పాత్రలు పోషించారు.

ఈ సిరీస్ మొత్తం హిలేరియస్ గా ఉంటుంది. ఇక ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. వివరాల్లోకి వెళితే.. సంతోషం-2022 ఓటీటీ అవార్డ్స్ లో భాగంగా ‘అహ నా పెళ్ళంట’ సిరీస్ కు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్టర్-2022 కేటగిరిలో రాజ్ తరుణ్ కు, అలాగే బెస్ట్ ప్రొడ్యూసర్ -2022 కేటగిరిలో ‘తమడ మీడియా’ నిర్మాతలైన రాహుల్ తమడ, సాయి దీప్ రెడ్డి లకు అవార్డులు వరించాయి.

నిర్మాతలకు అచ్చి రెడ్డి అవార్డును అందించగా, హీరో రాజ్ తరుణ్ కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రాహుల్ తమడ మాట్లాడుతూ.. ‘ముందుగా జీ5 వారికి థాంక్స్. ఇలాంటి మంచి సిరీస్ నిర్మించడానికి సహకరించినందుకు.! దర్శకుడు సంజయ్ ఇక్కడ లేకపోయినా అతనికి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను.

బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మా హీరో రాజ్ తరుణ్ కు కూడా నా ప్రత్యేక అభినందనలు’ అంటూ చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘ముందుగా నా నిర్మాతలు రాహుల్, సాయి దీప్ లకు స్పెషల్ థాంక్స్. అలాగే దర్శకుడు సంజీవ్ కు అలాగే టీం అందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరంతా ఇంత కోపరేట్ చేయకపోతే నేను అంత బాగా చేసేవాడిని కాదు సిరీస్ కూడా ఇంత బాగా వచ్చేది కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus