1920 లో అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగినట్టు…?

  • March 27, 2020 / 01:35 PM IST

రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడు అంటేనే విపరీతమైన హైప్ మొదలు పెట్టినప్పటి నుండీ భారీ అంచనాలు పెరిగిపోవడం ఖాయం . ప్రత్యేకంగా స్టార్ హీరోలు కూడా అవసరం లేదు. అలంటిది స్టార్ హీరో ఉంటే… డబుల్ అవుతాయి… అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ అయితే ఆది ‘అర్.అర్.అర్’ రేంజ్ లో ఉంటుంది అని… ఒక్క మాటలో చెప్పొచ్చు. చరణ్ , ఎన్టీఆర్ లతో జక్కన్న చెక్కుతోన్న ఈ చిత్రం ప్రారంభం నుండే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళ , మళయాళ భాషల్లో కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉంటాయి. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంది. ‘రౌద్రం రణం రుథిరం’ అనేది ఫుల్ టైటిల్ అని తెలుపుతూనే పంచభూతాలలో భాగమైన నిప్పు తో అల్లూరి (చరణ్) పాత్రను అలాగే నీరు తో కొమరం భీమ్(ఎన్టీఆర్ ) పాత్రని పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేసాడు జక్కన.

1920 బ్యాక్ డ్రాప్ లో అల్లూరి అలాగే భీమ్ ల మధ్య జరిగిన కల్పిత కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరికి గురువుగా అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందని కూడా తెలుస్తుంది. వేరు వేరు రాష్ట్రాలకి చెందిన ఈ మహా వీరులు కలిసినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఒకవేళ కలిస్తే మనకి స్వాతంత్ర్య పోరాటం ఎంత ఈజీ అయ్యేది … అనే కల్పిత కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మరి అనుకున్న టైం కి అంటే… జనవరి 8న ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి మరి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus