Dhanush: ఫుల్‌గా ఫుడ్‌ లాగించేసిన ధనుష్‌.. పిక్స్‌ వైరల్‌!

  • February 18, 2022 / 11:35 AM IST

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ రెస్టరెంట్‌కి వెళ్లి భోజనం చేశాడు. అది కూడా హైదరాబాద్‌లో ఉన్న మిలటరీ రెస్టరెంట్‌కి వెళ్లి తిన్నాడు. ‘ఇందులో విషయం ఏముంది? హైదరాబాద్‌లో షూటింగ్‌ కోసమని వచ్చి ఉంటాడు. రెస్టరెంట్‌కి వెళ్లి తిన్నాడు’ అని అంటారా? అవును మీరు అన్నది నిజమే. ఇక్కడివరకు జరిగి ఉంటే ఓకే. అయితే రెస్టరెంట్‌లో తింటున్న ఫొటోల్లో ఓ అమ్మాయి కూడా పక్కన ఉంది. ఇప్పటికే ఈ ఫొటోల్లో మీరు గమనించే ఉంటారు. ఆమె ఎవరు? ఇదే ఇప్పటి ప్రశ్న. గత కొన్ని రోజులుగా నెటిజన్లు రైజ్‌ చేస్తున్న ప్రశ్న.

Click Here To Watch

ధనుష్‌ ప్రస్తుతం వరుస సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. ఓవైపు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ‘నాన్‌ ఒరువేన్‌’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘వాతి’ / ‘సార్‌’ అనే సినిమా చేస్తున్నాడు. మూడు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ హోటల్‌కు ధనుష్‌ లంచ్‌కి వచ్చాడు. ఆ విషయాన్ని ఆ హోటల్‌ సోషల్‌ మీడియా, ధనుష్‌ సినిమా పీఆర్‌ టీమ్‌ షేర్‌ చేశాయి.

ఆ ఫొటోల్లో ధనుష్‌ పక్కనే కూర్చుని పింక్‌ కలర్‌ హూడీలో ఓ అమ్మాయి ఉంది. దీంతో ఆ అమ్మాయి ఎవరు అంటూ వెతకడం మొదలుపెట్టారు. కొందరేమో కథానాయిక ప్రియాంక అరుళ్‌ మోహన్‌ అని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె కాదని, ధనుష్‌ టీమ్‌లోని ఓ అమ్మాయి అని అంటున్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ధనుష్‌ విడాకులు ఇటీవల అనౌన్స్‌ చేసిన క్రమంలో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ధనుష్‌ టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం అయితే లేదు.

ఇక ధనుష్‌ రాబోయే సినిమాల సంగతి చూస్తే… మాళవిక మోహనన్‌తో కలసి నటించిన ‘మారన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత హాలీవుడ్‌ సినిమా ‘ది గ్రే మ్యాన్‌’ వస్తుంది. ఆ తర్వాత ‘తిరుచిరాంబలమ్‌’ అనే సినిమా వస్తుంది. ఇందులో ధనుష్‌ సరసన నిత్య మీనన్‌, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ నటించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus