Bro Movie: బ్రో విషయంలో మహేష్ సైలెంట్ అవ్వడానికి త్రివిక్రమ్ తో గొడవలే కారణమా?

  • August 3, 2023 / 08:04 PM IST

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు.అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా మూడవ సినిమా కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ నెలలో షూటింగ్ పనులు ప్రారంభించుకున్నప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా కొనసాగుతూ ఉంది. ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల సినిమాలు కనుక విడుదలయితే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ మధ్య మంచి అనుబంధమున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమాలపై మహేష్ బాబు స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

గతంలో వచ్చినటువంటి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలపై మహేష్ బాబు తన అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ ఇచ్చారు. కానీ బ్రో సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు మౌనంగా ఉన్నారు. ఇలా బ్రో విషయంలో మౌనంగా ఉండటానికి కారణం ఏంటి అనే చర్చ మొదలైంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు ఇక పవన్ కళ్యాణ్ నటించిన (Bro Movie) బ్రో సినిమాకి కూడా స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం విశేషం. అలాంటప్పుడు బ్రో సినిమా గురించి మహేష్ బాబు తప్పనిసరిగా స్పందించాల్సి ఉండగా ఈ సినిమాపై మౌనం వహించడంతో మహేష్ బాబుకి త్రివిక్రమ్ తో ఉన్నటువంటి మనస్పర్ధలే కారణమని అందుకే ఈ సినిమాపై మహేష్ బాబు చాలా మౌనంగా ఉన్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus