గోడపై కూర్చుని వివాదాన్ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్

  • June 4, 2020 / 04:00 PM IST

టాలీవుడ్ లో పెద్ద అగ్గి రాజేసుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన టాలీవుడ్ కీలక సమావేశాలకు బాలయ్యను పిలవక పోవడంతో, ఆయనను మీడియా సంప్రదించినప్పుడు ఆయన కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎందుకు పిలవలేదన్న బాలయ్య… తలసాని శ్రీనివాస యాదవ్ తో కలిసి భూములు పంచుకుంటున్నారా అన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపాయి. కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో ఎవరు కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదు అని బయట పడి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు బాలయ్యకు అనుకూలంగా మాట్లాడుతుంటే మరి కొందరు చిరుకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఐతే ఈ సమావేశంలో మేము పెద్దలం అని పాల్గొన్న కొందరు స్టార్ డైరెక్టర్స్ ఈ విషయం పట్ల మాట్లాడకుండా ఎందుకు గమ్మున ఉండిపోయారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న రాజమౌళి, త్రివిక్రమ్ మరియు కొరటాల శివ వంటి వారు, ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ఇంత రచ్చ జరుగుతున్న దీనిపై స్పందించాల్సిన బాధ్యత వీరికి లేదా?. ఖచ్చితంగా ఉండదు.. ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా వీరికి అటు మెగాస్టార్, ఇటు నందమూరి ఫ్యామిలీ అండ కావాలి.

ఏ ఒక్కరికి కొమ్ము కాసినా, మరొక హీరో ఫ్యాన్స్ కి, కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి. కాబట్టి వీరు గోడ మీద కూర్చోని వివాదాన్ని వేడుకలా చూస్తుంటారు. చివరిగా ఎవరు గెలిస్తే వారి పక్కన చేరి భజన మొదలు పెడతారు. అవకాశవాదమే తప్ప మాటలో వీరికి చిత్తశుద్ధి ఉండదు. ఏ హీరో కొత్త సినిమా వేడుకలో.. ఆ హీరోకి సాటిలేరని పొగుడుతారు కదా..ఆ లెక్కన్న అన్న మాట.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus