దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో ఈ ఏడాది ముందుగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కి కలిసిరాలేదు. మరోపక్క పైరసీ కూడా ఈ సినిమాని ఈవెనింగ్ షోలకే చంపేసింది అని చెప్పాలి. అలా ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి భారీ నష్టాలు వచ్చి పడ్డాయి.
అయితే ఆ వెంటనే వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా దిల్ రాజు (Dil Raju) ని సేఫ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ‘గేమ్ ఛేంజర్’ కి వచ్చిన నష్టాలకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి వచ్చిన లాభాలకి లెక్క కరెక్ట్ గా సరిపోయింది. అంతకు మించి దిల్ రాజు (Dil Raju) కి మిగిలింది అంటూ ఏమీ లేదు.
ఇదిలా ఉండగా.. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్ లో దిల్ రాజు బిజీగా గడుపుతున్నారు. తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) అనే సినిమా చేస్తున్నారు. దీనికి రవికిరణ్ కోలా దర్శకుడు. దీంతో పాటే ‘ఎల్లమ్మ’ కూడా సెట్స్ పైకి వెళ్ళింది. ‘బలగం’ వేణు (Venu) దీనికి దర్శకుడు.
ఈ రెండిటిలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. మరోపక్క అల్లు అర్జున్ (Allu Arjun) తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) తో కూడా ఓ సినిమా సెట్ చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు.