Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు
- April 24, 2026 / 12:21 PM ISTByPhani Kumar
ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తేనే ఇండస్ట్రీ హిట్ అని సంబరాలు చేసుకునేవాళ్లం. కానీ బాహుబలితో మన టాలీవుడ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ను శాసిస్తూ వందల కోట్ల నుంచి వేల కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే 2027 సమ్మర్ సీజన్ నాటికి జరగబోయే బిజినెస్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కేవలం నాలుగు బడా సినిమాలు కలిపి ఏకంగా పది వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్గా బరిలోకి దిగుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ నలుగురు హీరోలు ఆ మార్క్ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
Tollywood
ఈ మెగా టార్గెట్లో సగం కలెక్షన్స్ రాబట్టే సత్తా రెండు ప్రాజెక్టులకు ఉంది. గ్లోబల్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. జక్కన్న ఇంటర్నేషనల్ క్రేజ్ దెబ్బకు ఈ ఒక్క సినిమాకే సుమారు రూ.3000 కోట్ల వసూళ్లు రావొచ్చని అంచనా. ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోతున్న ‘రాకా’ (Raaka)మూవీ కూడా సైలెంట్గా రూ.2000 కోట్ల క్లబ్పై కన్నేసింది. కంటెంట్ కనెక్ట్ అయ్యి ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే.. సగం టార్గెట్ (రూ.5 వేల కోట్లు) ఈజీగా రీచ్ అయిపోయినట్లే.

పాన్ ఇండియా బాక్సాఫీస్ రారాజు ప్రభాస్ (Prabhas), కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ (Spirit) మూవీ మార్చి 5న థియేటర్లలోకి రానుంది. ఈ ఇద్దరి ఊరమాస్ కాంబోకి రూ.1500 నుంచి రూ.2000 కోట్లు రావడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా జూన్ 11న రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. సోలోగానే ‘దేవర’తో సత్తా చాటిన తారక్కు, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పడితే వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఏమంత కష్టం కాదు.
ఈ లెక్కలన్నీ వర్కౌట్ అయితే టాలీవుడ్ అకౌంట్లో 10 వేల కోట్లు పడటం గ్యారెంటీ. అయితే ఈ సినిమాల్లో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం వల్ల రిలీజ్ డేట్స్ అటూఇటూ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. పైగా తక్కువ గ్యాప్లోనే ఇన్ని పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి వస్తే ఆడియన్స్ జేబులకు చిల్లు పడటం కూడా ఖాయం. కానీ కంటెంట్ బ్లాక్బస్టర్ అయితే మాత్రం ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో ఇండియన్ సినిమా నంబర్ వన్ స్థానంలో టాలీవుడ్ కూర్చోవడం పక్కా.
‘ఉస్తాద్..’పై స్టార్ రైటర్ పోస్ట్ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..















