Sarileru Neekevvaru: 2020లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ‘సరిలేరు నీకెవ్వరు’ అట..!

  • July 23, 2021 / 07:10 PM IST

2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు- అనిల్ రావిపూడి ల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డుని సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం మరో రికార్డుని కూడా సొంతం చేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. 2020 వ సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 50 సినిమాల లిస్ట్ లో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 41వ స్థానంలో నిలిచిందట.

అంతేకాదు ఈ లిస్ట్ లో సౌత్ నుండీ స్థానం సంపాదించుకున్న ఏకైక చిత్రంగా కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం గురించి చెబుతున్నారు. ఈ చిత్రం మొత్తంగా $37.38 మిలియన్లను వసూల్ చేసిందట. అంటే దాదాపు రూ.278 కోట్ల గ్రాస్ అని అంచనా. అయితే మరి ‘అల వైకుంఠపురములో’ సంగతేంటి అనేది పెద్ద ప్రశ్న. 2020 లో అత్యధిక కలెక్షన్లను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘అల వైకుంఠపురములో’ మూవీ అని దర్శకనిర్మాతలు అంతా వెల్లడించారు.

మరి ఇప్పుడు ‘సరిలేరు’ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఎలా అవుతుంది. ఇది నిజమేనా లేక.. ఈ మధ్యన టీజర్ల వ్యూస్ కి చేస్తున్నట్టు ఏమైనా జిమిక్కులు చేసారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా వ్యక్తమవుతున్నాయి. ‘సరిలేరు’ ‘అల’ విడుదల టైములో మహేష్, బన్నీ అభిమానులు ఒకరినొకరు తెగ ట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus