ఆ ముగ్గురు దర్శకులలో ఎన్టీఆర్ ఎవరికి ఓటేస్తాడు

  • May 7, 2020 / 08:43 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ రీత్యా ఆయన కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. ఇతర పరిశ్రమలకు చెందిన దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం ఆయన క్రేజ్ కి నిదర్శనం. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయనతో మూవీ చేయడానికి అనేక మంది కథలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ, కెజిఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ గట్టిగా ప్రయత్నించారు. ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు అయిన అశ్వినీ దత్ అట్లీ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐతే ఈ ముగ్గురు దర్శకులలో ఎవరితో ఎన్టీఆర్ తన 31వ చిత్రం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ 31వ చిత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురు దర్శకుల్లో ఒకరితో ఉంటుంది అనేది ఖాయం. మరి ఎన్టీఆర్ ఎంపిక ఎవరు అనేది ఆసక్తికర అంశం. ఈ ముగ్గురు దర్శకులు ఖచ్చితంగా హిట్ ఇవ్వగల దమ్మున్న దర్శకులు. ముగ్గురు బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.

ఐతే ఎన్టీఆర్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో మూవీ ఒకే చేసేశాడని తెలుస్తుంది. దాదాపు ప్రశాంత్ నీల్ తోనే ఎన్టీఆర్ 31వ చిత్రం ఉంటుందని వినికిడి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే మరో ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ విరామంలో ఎన్టీఆర్ మనసు ఎవరిపైకి మళ్లుతుందో చూడాలి. ఐతే ఈ ముగ్గురు దర్శకులతోనే ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా చిత్రం ఉంటుందట.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus