ఆ ముగ్గురు నిర్మాతలు తప్పుకుంటే… అనిల్ సుంకర ముందుకొచ్చాడట..!

  • September 14, 2020 / 09:14 PM IST

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ … ఇప్పటికే 3 చిత్రాలు చేసినప్పటికీ సరైన హిట్టు అందుకోలేకపోయాడు. మొదటి రెండు సినిమాలు డైరెక్టర్ల క్రేజ్ తో 20 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టినా.. 3వ సినిమా మాత్రం 10 కోట్ల షేర్ ను మాత్రమే నమోదుచేసింది. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రం ఇంకా విడుదల కాలేదు కాబట్టి .. ప్రస్తుతానికి అఖిల్ మార్కెట్ 10 కోట్లు మాత్రమే ఉందని చెప్పాలి.ఇలాంటి టైములో సురేందర్ రెడ్డి తో అఖిల్ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చాడు.

స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ చిత్రానికి 45 కోట్ల నుండీ 50 కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అది 60 కోట్ల వరకూ కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.ఒక 30 కోట్లలోపు బడ్జెట్లో అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాత సేఫ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అఖిల్ ను నమ్మి 60 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలని .. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ’14 రీల్స్ ప్లస్’ వంటి సంస్థలు తప్పుకున్నాయట.

ఈ క్రమంలో ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు ఇన్సైడ్ టాక్. మరి ఇంత పెద్ద సాహసం చేస్తున్న అనిల్ సుంకరకు ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus