మోడీతో భేటీ అయిన కన్నడ హీరోలు.. కారణం ఏమిటి..?

  • February 13, 2023 / 09:06 PM IST

కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన హీరో యశ్. ఇక ఇటీవల విడుదలైన కాంతార సినిమా ద్వారా రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. తాజాగా వీరిద్దరూ తోపాటు హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్ లతో పాటుగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విధంగా వీరంతా ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చంశనీయంగ మారింది.

వీరందరూ మోదీని కలవడానికి కారణం ఏంటని అందరూ ఆలోచనలో పడ్డారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో వేగంగా దూసుకెళ్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుండి విడుదలైన కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన కన్నడ చిత్ర పరిశ్రమ పేరు ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. తాజాగా కన్నడ స్టార్ సెలబ్రిటీస్ అయినటువంటి యశ్, రిషబ్ ప్రధానమంత్రి మోడీని కలవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

అయితే వీరు ఇలా మోడీ నీ కలవటానికి కారణం ఏమిటంటే.. సోమవారం ప్రారంభించిన ఏరో ఇండియా ప్రారంభోత్సవానికి మోడీ బెంగళూరు వచ్చారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన మోదీతో ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినిమా స్టార్లు సమావేశం అయ్యారు. ఇందులో భాగంగానే వీరు కూడా మోడీని కలిశారు. ఈ క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ప్రధానమంత్రికి వివరించారు.

కర్ణాటకను ఫిల్మ్ సిటీగా మార్చాలని, ఫారిన్ లో ఉన్నటు వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్బంగా మోదీకి అభ్యర్థించారు. వీటితో పాటుగా కన్నడ సినీ పరిశ్రమ అత్యధిక పన్నులు చెల్లిస్తోందని,అందుకు తగ్గట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ మోడీని కోరినట్లు సమాచారం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus