నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసిన ధన్సిక!
- November 16, 2017 / 01:10 PM ISTByFilmy Focus
హీరోయిన్స్ తమపై జరిగిన లైంగిక. మానసిక దాడుల గురించి నోరు విప్పుతున్నారు. తాజాగా కబాలి మూవీలో రజనీకాంత్ కి కూతురిగా నటించిన ధన్సిక తనకి జరిగిన విషయాన్నీ బయటపెట్టారు. తమిళ హీరో శింబు తండ్రి, నిర్మాత టి రాజేందర్ తనని మానసికంగా వేధించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “రెండు నెలల క్రితం రాజేందర్ నన్ను ఒక మీడియా సమావేశంలో అందరి ముందు అవమానించారు. ఓ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ముందుగా నేను మాట్లాడాను. వేదికపై ఉన్న అందరి గురించి ప్రస్తావించాను. రాజేందర్ ని మర్చిపోయాను. అందుకు అప్పుడే అతనికి క్షమాపణలు చెప్పాను. కానీ అతను వినిపించుకోలేదు. దీంతో అందరి ముందు రాజేందర్ నన్ను అసభ్యపదజాలంతో దూషించారు.
ఆయన్ను ఆపడానికి అక్కడున్న వారు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు.” అని ఆనాటి సంగతిని వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. “రాజేందర్ ఆధ్యాత్మిక వ్యక్తీ అని అందరు భావిస్తారు. అది తప్పు. ఆధ్యాత్మిక వ్యక్తులు అరవరు. కానీ అతను మాత్రం ఒక మహిళ అని చూడకుండా తిట్టారు. ఆయన వల్ల నేను మానసికంగా కృంగిపోయాను .. చాలా రోజులు బయటకు రావడానికి కూడా చాలా భయపడ్డాను” అని ఆమె తన బాధను వెళ్లగక్కారు. ధన్సిక మాటలు కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోను హాట్ టాపిక్ అయ్యాయి.














