Esha Gupta: అచ్చం సమంతలానే మయోసైటిస్ వ్యాధికి గురైన నటి ఈషా గుప్తా!

  • July 29, 2023 / 06:04 PM IST

హీరోయిన్లు తెరపై చూడటానికి ఎంతో అందంగా కనపడుతూ ఉంటారు. కానీ ఆ అందం కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది పైకి అందంగా కనిపించిన లోపల మాత్రం భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి బయటకు చెబితే తనకు ఎక్కడ అవకాశాలు రావన్న భయంతో ఈ విషయాలను దాచిపెట్టేవారు. ప్రస్తుతం మాత్రం తమకు వచ్చినటువంటి వ్యాధి గురించి నలుగురితో పంచుకోవడం వల్ల ఎంతో మనోధైర్యం కలుగుతుండడంతో ఎంతో మంది సెలబ్రిటీలు వారు బాధపడుతున్నటువంటి ఇబ్బందుల గురించి బయటపెడుతున్నారు.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు తాము ఇలాంటి వ్యాధితో బాధపడ్డామని బాధపడుతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.తాజాగా నటి ఈషా గుప్తా సైతం ఆక్సిజన్ మాస్క్ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె ఈ ఫోటోకి హైపర్బేరిక్ థెరపీ అంటూ క్యాప్షన్ పెట్టారు ఈ తెరపి మయోసైటిస్ వ్యాధి సోకిన వారికి మాత్రమే అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాధి బారిన పడ్డవారు కండరాలు బలహీనతను కోల్పోతారు. అందుకే ఈ థెరపీ అందిస్తారని తెలుస్తుంది.ఇలా ఈమె ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్న వార్త తెలియడంతో సమంత మాదిరిగానే ఈమె కూడా మయూసైటిస్ వ్యాధి బారిన పడ్డారా అందుకే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సమంత ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా గుప్తా (Esha Gupta) సైతం తాను హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నానని చెప్పడంతో ఈమె కూడా అదే వ్యాధిబారిన పడ్డారని తెలుస్తోంది. అయితే ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తెలుగులో ఈషా గుప్త రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఏక్ బార్ ఏక్ బార్ అనే సాంగ్ లో నటించి మెప్పించారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus