జమున, కె.విశ్వనాథ్ అరుదైన పిక్స్ షేర్ చేసిన నటి లయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 3, 2023 / 08:31 PM IST

వరుస ప్రమాదాలు, ప్రముఖుల మరణాలతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల వారు షాక్ అవుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో కైకాల సత్య నారాయణ, సీనియర్ నటి జమున కన్నుమూసిన సంగతి మర్చిపోకముందే ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఇకలేరనే వార్తతో టీలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. తన అపురూపమైన చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక దిగ్గజం, అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించి, ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని మార్చిన ‘కళాతపస్వి’ 92 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

పలు రంగాలకు చెందిన ప్రముఖులు విశ్వనాథ్ పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేశారు. సినీ, మీడియా ప్రముఖులు ఆయనతో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా నటి లయ కూడా జమున, విశ్వనాథ్ గార్లతో ఉన్న పిక్స్ షేర్ చేశారు.

తమ వివాహ రిసెప్షన్‌కి విచ్చేసి ఆశీర్వదిస్తున్న పిక్చర్స్ షేర్ చేస్తూ వారికి నివాళి అర్పించారామె. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న లయ అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus