‘గులాబీ’ హీరోయిన్‌ని గుర్తు పట్టారా!.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • November 30, 2022 / 12:10 AM IST

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ షేర్ చేసిన రీసెంట్ పిక్స్ కొన్ని ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు షాక్ ఇచ్చాయి. జాన్వీ తన పిన్ని మహేశ్వరితో కలిసున్న ఇమేజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మహేశ్వరి అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ ‘గులాబీ’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం త్వరగా రికగ్నైజ్ చేస్తారు. ఫస్ట్ ఫిలిం ‘అమ్మాయి కాపురం’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మహేశ్వరి..

‘పెళ్లి’, ‘దెయ్యం’, ‘మృగం’, ‘జాబిలమ్మ పెళ్లి’, ‘ప్రియరాగాలు’, ‘నీకోసం’,‘మా అన్నయ్య’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. తర్వాత వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అయిపోయింది. శ్రీదేవికి సిస్టర్ అవుతుందని, లేదు.. శ్రీదేవి అక్క సూర్య కళ కూతురు అంటారు కానీ చాలా మందికి క్లారిటీ లేదు. రీసెంట్‌గా మహేశ్వరిని కలిసిన జాన్వీ ఆ ఫోటోలు నెటిజన్లతో పంచుకుంది. మహేశ్వరి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన చిలిపి చూపులు, ఆకట్టుకునే రూపం, వినగానే గుర్తు పట్టేసే గొంతుతో అలరించిన ఆ మహేశ్వరినేనా?

అని షాక్ అయ్యేంతలా మారిపోయింది.. రెగ్యులర్‌గా సినిమాలు చేస్తుంటే ఫిజిక్ మీద ఫోకస్ పెడతారు కానీ గ్యాప్ వస్తే కష్టం కదా.. సో, అలాగే 45 ఏళ్ల మహేశ్వరి పోల్చుకోవడానికి కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. ఓ షూటింగ్ సందర్బంగా జాన్వీ, పిన్నితో తీసుకున్న మహేశ్వరి ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus