Manchu Lakshmi: కూతురి కోసం నెటిజన్ల సాయం కోరిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

  • July 5, 2024 / 11:56 AM IST

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇటీవల చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు ఆమె పోస్టులకు ట్రోల్‌ చేసే నెటిజన్లు ఈసారి ఆమెకు సాయం కూడా చేశారు. ఆ పోస్టు ఆమె కూతురు గురించి కావడం గమనార్హం. వీసా అప్రూవ్‌ అయినా ఇంకా తన చేతికి రాలేదు, ఈ విషయంలో ఏదైనా సాయం చేస్తారా అంటూ మంచు లక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు కోరింది. ఇంతకీ ఏమైందంటే..

భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, రాయబారి ఎరిక్‌ గార్సెట్టి సోషల్‌ మీడియా ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ మంచు లక్ష్మి ఓ ట్వీట్‌ చేసింది. అందులో తన పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అమెరికన్‌ సిటిజన్‌ అయిన తన కుమార్తె విద్యా నిర్వాణ స్కూల్‌ సెలవులు త్వరలోనే అయిపోతున్నాయని, ఆమె ఈ నెల 12న అమెరికాకు వెళ్లాల్సి ఉందని ఆ పోస్టులో మంచు లక్ష్మి పేర్కొన్నారు.

అయితే అమెరికన్‌ రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఏదో టెక్నికల్‌ ఇష్యూ ఉందని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎంబసీ సిబ్బందిని సంప్రదించడానికి కూడా అవ్వడం లేదని మంచు లక్ష్మి పేర్కొన్నారు. వీసా జారీ అయి నెల రోజులు అయినా ఇంకా తనకు రాలేదని ఆమె చెప్పారు. దీంతో ఈ విషయంలో ఎవరైనా హెల్ప్‌ చేయగలరా? అని అడిగారు.

మంచు లక్ష్మి పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ తమకు తెలిసిన సమాచారం ఇస్తున్నారు. కొందరైతే ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని ఎంబసీకి వెళ్లండి, అక్కడ మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుందని చెబుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఎప్పటిలాగే ఆమెను సూటిపోటి మాటలతో ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరైతే ఈ విషయం మీద ఫాలో అప్‌ చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఈ విషయంలో మంచు లక్ష్మి ఏం చేస్తుందో? ఏదైనా ఫలితం వస్తే ట్వీట్‌ చేస్తుంది అనుకోండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus