Actress: సినిమా ఇండస్ట్రీపై మరోసారి ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్… ఈ సారి ఏమందంటే?

  • October 4, 2023 / 01:42 PM IST

ఇండస్ట్రీలో హీరోయిన్లు, నటీమణుల పరిస్థితి గురించి, వాళ్లను చూసే విధానం గురించి తరచుగా మాట్లాడుతుంటారు కొంతమంది నటీమణులు. కొన్నిసార్లు ఆ మాటలు వైరల్‌ అయ్యి, ఆ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలా మాట్లాడేవారిలో పాయల్‌ ఘోష్‌ ఒకరు. బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో కొన్నాళ్ల క్రితం హీరోయిన్‌ పాత్రలు, సైడ్ క్యారెక్టర్‌లు చేసింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో డార్క్‌షేడ్‌ను వివరిస్తూ ఉంటుంది. అలా తాజాగా బాలీవుడ్‌ స్టైల్‌ గురించి మాట్లాడింది.

బాలీవుడ్‌లోఎంట్రీ ఇచ్చుంటే నా దుస్తులు తొలగించే వాళ్లు… అంటూ ఘాటుగా స్పందించింది పాయల్‌ ఘోష్‌. అంతేకాదు బాలీవుడ్‌ జనాలకు టాలెంట్‌తో పని లేదు.. దుస్తులు తీసేసి అందాలు చూపిస్తే చాలు అంటూ బాలీవుడ్‌పై విరుచుకు పడింది. బాలీవుడ్‌లో కమిట్‌మెంట్ పేరుతో జరిగే పరిస్థితులపై సంచలన ఆరోపణలు చేయడంతో ఇప్పటికే ఆమె ఇండస్ట్రీకే దూరమైంది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌పై తనదైన శైలిలో విరుచుకుపడింది.

గతంలో నేరుగా విమర్శలు చేసిన (Actress) పాయల్‌ ఘోష్‌ తాజాగా ట్విటర్‌లో కామెంట్స్‌ చేసింది. ‘‘దేవుడి దయ వల్ల సౌత్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాను. ముందే బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేసి ఉంటే… దుస్తులు లేకుండా నటించమనేవారు. అలా నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు’’ అని చెప్పింది పాయల్‌. అయితే గతంలో లాగే ఆమె కామెంట్లను పట్టించుకోకుండా వదిలేసినట్లే ఇప్పుడు కూడా వదిలేస్తారా? లేక ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

టాలీవుడ్‌లో మంచు మనోజ్ హీరోగా ‘ప్రయాణం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది పాయల్ ఘోష్. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. ఇక ఆమె గతంలో చేసిన ఆరోపణల ప్రకారం అయితే… బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడు అంటూ కామెంట్స్‌ చేసింది. అంతేకాదు అతని నుండి ప్రాణ హాని కూడా ఉందని ఆరోపణలు చేసింది. అప్పుడు కూడా ఈ విషయంలో ఎవరూ స్పందించలేదు. అలానే ఇప్పుడూ చేస్తారా? ఏమో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus