Raashi: సోషల్‌ మీడియాలో రాశి శాడ్‌ పోస్టు వైరల్‌… ఏమైందంటే?

  • November 28, 2023 / 08:39 PM IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాశీ ఖన్నా… ఇప్పుడు కామ్‌గా ఉంది. ఎందుకు సినిమాలు తగ్గాయో తెలియదు కానీ… ఆమె కొత్త సినిమాల వార్తలు అయితే టాలీవుడ్‌లో తగ్గిపోతున్నాయి. అయితే రీసెంట్‌గా ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌ అయ్యింది. అందులో పెద్దగా ఏం లేనప్పటికీ… పోస్టును క్షుణ్నంగా చూడనివాళ్లు ఇదేమైనా ప్రేమకు సంబంధించిందా అనుకున్నారు. అంతలా ఏమైందంటే?

రాశీ ఖన్నా ఇటీవల తెలుగులో సినిమాలు చేయడం లేదు. రవితేజ – గోపీచంద్‌ మలినేని సినిమాను ఓకే చేసింది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమానే ఆగిపోయింది అంటున్నారు. దీంతో ఆమె చేతిలో ఓ తమిళ సినిమా, రెండు హిందీ సినిమాలే ఉన్నాయి. అందులో ఒకటి విక్రమ్‌ మాస్సే హీరోగా రూపొందుతున్న ‘టీఎంఈ’. ఈ సినిమా ఇటీవల పూర్తైంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అదే ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆ సినిమా షూటింగ్‌ సందర్భంలో తన అనుభవాలు చెబుతూ, టీమ్‌కు ధన్యవాదాలు చెప్పేలా ఓ పోస్ట్‌ చేసింది. ఉద్వేగభరితమైన ఆ పోస్టుతోపాటు దర్శకుడు, హీరోతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. అలాగే బ్రోకెన్‌ హార్ట్‌ సింబల్‌ను కూడా పెట్టింది. ‘నా హృదయానికి దగ్గరైన ‘టీఎంఈ’ సినిమా షూటింగ్‌ పూర్తయింది అని రాసుకొచ్చింది. ఈ మొత్తం విషయం చదవని కొంతమంది నెటిజన్లు ‘ఏమైంది రాశీకి’ (Raashi) అని అనుకుంటున్నారు.

ఆ విషయం పక్కనపెడితే… ‘టీంఎఈ’లో తన పాత్ర ఊహలకు అందదని అలాగే సినిమాలో విచిత్రమైన మలుపులుంటాయి అని కూడా చెప్పింది. ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు నరాలు జువ్వున లాగేసేవని, లోలోపల తుపాన్లు చెలరేగేవి అని కూడా చెప్పింది. అంతేకాదు ఒక్కోసారి మానసికంగా ఆ ప్రభావం నుంచి తేరుకోలేకపోయాను అని కూడా చెప్పింది. అంతటి ఇంటెన్సివ్‌ పాత్ర అది అని తెలిపింది. అంత స్పెషల్‌ ఆ పాత్రలో ఏముంది అని అభిమానులు, నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఆ సమయంలో విక్రమ్‌ అండగా నిలిచాడు అని చెప్పింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags