Actress Roja: ఆ షోలో ఎమోషనల్ అయిన రోజా!

  • September 4, 2021 / 03:30 PM IST

సీనియర్ నటి, ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ సంతోషంగా ఉంటారనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోకు జడ్జిగా చేస్తున్న రోజా ఆ షోలో కమెడియన్లపై పంచ్ లు వేస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తారు. అయితే తాజాగా విడుదలైన మా ఊరిలో వినాయకుడు ప్రోమోలో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లికి ముందు, హీరోయిన్ గా ఉన్న సమయంలో ఎదురైన కష్టాలను రోజా ఈ షోలో చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ కు రోజాతో పాటు రోజా కొడుకు, కూతురు కూడా హాజరయ్యారు.

తాను సినిమా ఇండస్ట్రీలోకి 1991 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చానని 2022 సంవత్సరం వరకు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను అప్పులు కట్టడం కోసమే ఖర్చు చేశానని రోజా అన్నారు. పెళ్లి కాకముందు తాను ఎన్నో కష్టాలను అనుభవించానని రోజా పేర్కొన్నారు. పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారని అలా చెప్పడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె వెల్లడించారు. పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత తనకు అన్షు మాలిక జన్మించిందని కూతురు అంటే తనకు ఎంతో ఇష్టమని రోజా కామెంట్లు చేశారు.

రోజా ఎమోషనల్ అవుతూ చెప్పడంతో షోలో పాల్గొన్న వాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. రోజా బాధ పడుతూ తన ఆవేదనను చెప్పుకున్న ప్రోమో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన అభిమానులకు సైతం తెలియని రహస్యాలను రోజా ఈ షో ద్వారా వెల్లడించడం గమనార్హం. గడిచిన 9 సంవత్సరాలుగా జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus