Actress Sada: ముంబైలో దాడులు జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను: సదా

  • June 20, 2022 / 02:54 PM IST

అడివి శేష్ హీరోగా.. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ‘మేజర్’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 26/11 ముంబైలో ఉన్న తాజ్‌ హోటల్‌ పై ఉగ్రవాదులు దాడి చేయడం… ఇందులో తన ప్రాణాలను పనంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందింది. జూన్ 3 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది.

ఉన్నికృష్ణన్..పాత్ర గురించి బాగా స్టడీ చేసి అడివి శేష్ ఈ చిత్రంలో మంచి నటన కనబరిచాడు. మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడంతో విడుదలకి ముందు నుండీ ఈ చిత్రం భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. పలు చోట్ల ప్రీమియర్ షోలు వేయగా… సినిమా చూసిన వారిలో కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూశాం. తాజాగా నటి సదా ముంబైలో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్న తరుణంలో కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

అనంతరం సదా మాట్లాడుతూ.. “ముంబై దాడులు జరిగినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. మేజర్ మూవీ చూస్తుంటే ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటుంటే బాధ తన్నుకుంటూ వచ్చేసింది. నిజానికి ఆ రోజు కరెక్ట్ గా ఏమి జరిగింది అన్న విషయం అందరికీ తెలీదు.

కానీ ‘మేజర్’ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు” అంటూ సదా చెప్పుకొచ్చింది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సదా ప్రస్తుతం బుల్లితెర పై జడ్జిగా రాణిస్తున్నారు. రీ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన పాత్రల కోసం చూస్తుంది ఈ నటి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus