Jaswanth: బిగ్ బాస్ జస్వంత్ పై నటి బోల్డ్ కామెంట్స్!

  • April 21, 2023 / 06:26 PM IST

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి. ఇలా బుల్లితెరపై అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు, వినోదాన్ని అందిస్తున్నటువంటి కార్యక్రమాలలో ఢీ కార్యక్రమం ఒకటి. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఢీ15పేరిట ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నటి శ్రద్ధాదాస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రదీప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ జస్వంత్ అలియాస్ జెస్సి అలాగే యంగ్ యాంకర్ దివ్య నార్ని మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో ఆటపాటలతో ఎంతో వినోదాన్ని పంచుతుందని చెప్పాలి. అయితే 26వ తేదీ ప్రసారం కాబోయే ఈ కార్యక్రమ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా జస్వంత్ దివ్యని ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు. దివ్యకి బాగా చలిగా ఉందట.. వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమెకి దగ్గరగా ఉన్నానని జెస్సీ సమాధానం చెపుతాడు. ఇలా జెస్సి చెప్పడంతో వెంటనే శేఖర్ మాస్టర్ తనకు వేడి కలగాలి అంటే ముందు మనలో వేడి పుట్టాలి అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా జెస్సీ తెల్ల మొహం వేశాడు.

ఇక ప్రదీప్ మాట్లాడుతూ ఆరుగురు ప్రతివతలు సినిమాలో ఒక ఆయన కూర్చొని ఏడుస్తుంటారు చూడు. అలానా అంటూ కామెంట్ చేశారు. ఇలా కామెంట్ చేయడంతో నా గురించి మీకు తెలియదు అంటూ చాలా గంభీరంగా మాట్లాడుతాడు.ఆ సమయంలోనే నటి శ్రద్ధాదాస్ నాకు తెలుసు అని చెప్పడంతో తన గురించి గొప్పగా మాట్లాడుతుందని జెస్సి ఆశ పడతారు.

ఇక శ్రద్ధాదాస్ తన గురించి మాట్లాడుతూ నువ్వు పూజకు పనికిరాని ఒక పువ్వు అట కదా అని అనడంతో ఒక్కసారిగా జెస్సి (Jaswanth) ముఖ కవళికలు మారిపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.సరదాకే అయినా కూడా ఒక వ్యక్తి గురించి ఇలా వల్గర్ గా అందరి ముందు మాట్లాడడం భావ్యం కాదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus