Adivi Sesh: మేజర్ కంటే ముందే బాలీవుడ్ ఆఫర్స్!

  • December 3, 2021 / 07:30 PM IST

కేవలం నటుడిగానే కాకుండా అడివి శేష్ తన సినిమాలకు తన కథలను అందించుకుంటూ బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఇక శేష్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒకటి కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. త్వరలోనే అతను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఎలాగైనా మేజర్ సినిమాతో తన మార్కెట్ ను విస్తరించు కోవాలని అడవి శేష్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతే కాకుండా అవసరమైన సమయంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో కూడా బిజీబిజీగా పాల్గొంటున్నాడు. ఇటీవల ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టబోతున్నట్లు చెప్పాడు. బడా బ్యానర్స్ లోనే అడవి శేషు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరణ ఇచ్చాడు.

మేజర్ సినిమా అనంతరం తన కెరీర్ మరింత డిఫరెంట్ గా ఉంటుంది అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. ఇక బాలీవుడ్ సినిమాలను ఎవరి దర్శకత్వంలో చేస్తున్నాడు అనే విషయాలు ఏవి కూడా ఈ హీరో ఇంకా రివిల్ చేయలేదు. ఇక ప్రస్తుతం మేజర్ సినిమా విడుదల తరువాత అడవి శేష్ గూడచారిని కూడా మొదలు పెట్టబోతున్నారు. అంతే కాకుండా మరో రెండు తెలుగు సినిమాలు చేయడానికి కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus