మరోసారి మహేష్ తో రొమాన్స్ చెయ్యబోతున్న అనుష్క..!

  • November 21, 2020 / 04:58 PM IST

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టి కూల్ గా రిలాక్స్ అవుతూ వచ్చిన మహేష్ బాబు.. తన తరువాతి చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చెయ్యబోతున్నాడు.’సర్కారు వారిపాట’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.’మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఇప్పటికే టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ చిత్రం కోసం లాంగ్ హెయిర్ ను పెంచి చాలా స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు.ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా నటించాల్సి ఉందట. అందుకుగాను స్టార్ హీరోయిన్ అనుష్క ను ఎంపిక చేసుకున్నట్టు తాజా సమాచారం. ఆమె పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకంగా ఉండబోతుందట. అంతేకాదు ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం అనుష్కకు భారీ రెమ్యూనరేషన్ ను నిర్మాతలు ఆఫర్ చేసినట్టు ప్రస్తుతం డిస్కషన్లు మొదలయ్యాయి.

10 ఏళ్ళ క్రితం త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఖలేజా’ చిత్రంలో కలిసి నటించారు మహేష్, అనుష్క లు. ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కానీ… బుల్లితెర పై మాత్రం ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. ఇదిలా ఉండగా.. ‘సర్కారు వారి పాట’ పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. నిజానికి ఈ నెల ప్రారంభంలోనే ‘సర్కారు వారి’ టీం అమెరికాలో ఉండాల్సింది. కానీ యూనిట్ సభ్యులకు వీసాల సమస్య తలెత్తడంతో లేట్ అయ్యినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus