మొన్న త్రిష… ఇప్పుడు కాజల్ కూడానా..?

  • April 29, 2020 / 07:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై రాంచరణ్, నిరంజన్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 40 శాతం పూర్తయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకూ హీరోయిన్ లేకుండానే పూర్తి చేసారు. దానికి ప్రధాన కారణం ఈ చిత్రం చెయ్యడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రాకపోవడమే అని తెలుస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడమే అనేది ఇన్సైడ్ టాక్. అందుకే హీరోయిన్ కూడా ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవడం లేదట. విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట త్రిష ను అనుకున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. కాని ఆమె క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె తప్పుకుంటున్నాను అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. తరువాత కాజల్ ను ఎంపిక చేసారు అని టాక్ నడిచింది.

అయితే ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు కాజల్ కూడా తప్పుకుంది అనేది తాజా సమాచారం. అవును ఇటీవల ఓ తమిళ సినిమా కోసం కాజల్ ను సంప్రదించారట. కథ నచ్చినా ప్లాపుల్లో హీరో కారణంగా ఆమె ఒప్పుకోలేదట. అయితే పారితోషికం ఎక్కువగా ఇస్తాము అని నిర్మాతలు భరోసా ఇవ్వడంతో… ‘ఆచార్య’ నుండీ తప్పకుందని తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులకు మాత్రం ‘ఆచార్య’ లో తన పాత్ర నచ్చలేదు అని చెప్పిందట.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus