Aishwarya Lekshmi: ‘మట్టి కుస్తీ’ గురించి ఐశ్వర్య లక్ష్మీ ఏం చెప్పిందంటే

  • November 30, 2022 / 02:21 PM IST

హీరోగా వరుస సినిమాలు చేస్తున్న రవితేజ… ఇటీవల నిర్మాతగా కూడా మారాడు. తను నటిస్తున్న సినిమాలకే నిర్మాత అవుతాడేమో అనుకుంటే.. వేరే హీరోతో కూడా సినిమా చేశాడు. అదే ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య లక్ష్మీ ఇటీవల మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో నిర్మాత రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

‘మట్టి కుస్తీ’ సినిమాకి రవితేజ కూడా నిర్మాతే. అయితే ఆయన ఎప్పుడూ సెట్‌కి రాలేదు. విష్ణు విశాల్‌ను నమ్మి.. మొత్తం సినిమా మీరు పూర్తి చేసేయండి, చివరిగా నాకు చూపించండి చాలు అని అన్నారట. అలా సిద్ధం చేసిన సినిమాను చూసి రవితేజ చాలా మెచ్చుకున్నారట. దీంతో అసలు సెట్‌కి వెళ్లకుండా రవితేజ… విష్ణు విశాల్‌ను అంతలా ఎలా నమ్మాడో అని ఓ చర్చ నడుస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ తొలి నాళ్లలో రవితేజ ఈ సినిమాలో భాగం కాదనే విషయం గమనార్హం.

ఇక ఐశ్వర్య లక్ష్మి తన కెరీర్‌ గురించి చెబుతూ..‘మట్టి కుస్తీ’ ప్రి రిలీజ్‌ వేడుకలో రవితేజ తన గురించి చెప్పిన విషయాలు చాలా ఆనందాన్నిచ్చాయి అని అంది,. అలాగే తెలుగులో సాయిపల్లవి, సత్యదేవ్‌తో తనకు మంచి పరిచయం ఉందని చెప్పింది. కొత్త సినిమాల విషయంలో తొందరేం లేదని, మంచి కథ, గుర్తు పెట్టుకునే పాత్రలు వస్తే చేయాలి అనేదే తన ఆలోచన అని చెప్పింది ఐశ్వర్య. కామెడీ ప్రధానంగా సాగే పాత్రలు ఎప్పడూ చేయలేదని, తొలిసారి ‘మట్టి కుస్తీ’తో ఆ ప్రయత్నం చేశాను అని చెప్పింది.

ఆడ, మగ సమానమే అనే మెసేజ్‌ను మట్టి కుస్తీ సినిమాలో వినోదాత్మకంగా చూపించారట. ఇందులో ఐశ్వర్య కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో కూడా నటించిందట. భావోద్వేగ సన్నివేశాలు నాకు కొట్టినపిండి, కానీ ఓ సవాల్‌గా తీసుకుని ఇందులో కామెడీ చేశా అని చెప్పింది. మూడేళ్ల కిందట ఈ కథ విన్నానని, తిరిగి మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ స్క్రిప్ట్‌ తన దగ్గరికే వచ్చిందని కూడా చెప్పింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus