Allu Aravind: సాయిధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు!

  • April 11, 2023 / 07:19 PM IST

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద సాయి ధరమ్ తేజ్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాయిధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాల క్రితం హైదరాబాదులో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు నెల రోజులపాటు హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఈయన క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లారు. ఇలా ఈ ప్రమాదం గురించి తాజాగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ విషయం తెలిసిన వెంటనే తానేముందుగా ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నానని అల్లు అరవింద్ తెలిపారు.

అయితే ఆ క్షణం సాయిధరమ్ తేజ్ నుచూడగానే ఒక్క క్షణం భయం వేసిందని తెలిపారు. ఎక్కడ ఒక చుక్క రక్తం రాలేదు అసలు ఏం జరిగిందోనని నాకు తెలియడానికి పావుగంట సమయం పట్టిందని తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి సాయి ధరమ్ తేజ్ బ్రతికి బయటపడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అల్లు అరవింద్ ప్రమాదం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక విరూపాక్ష సినిమాలో సాయి ధరంతేజ్ నటన చాలా అద్భుతంగా ఉందని (Allu Aravind) అల్లు అరవింద్ వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం గురించి సాయి తేజ్ కూడా గత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ఈ ప్రమాదం తనకు ఒక పీడకలగా భావించానని ఒక స్వీట్ మెమరీగా తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ కామెంట్ చేశారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus