Allu Arjun: చింతపల్లిలో సందడి చేసిన అల్లు అర్జున్… అభిమానులు!

  • November 28, 2022 / 07:37 PM IST

సినీ నటుడు అల్లు అర్జున్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా నల్గొండ జిల్లాలోని చింతపల్లి గ్రామంలో సందడి చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తోడల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి అనారోగ్య సమస్యలతో గత మూడు రోజుల క్రితం మరణించారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి అలాగే కూతురు అర్హత కలిసి అల్లు అర్జున్ చింతపల్లి గ్రామానికి చేరుకొని వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించి తమ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలా చింతపల్లిలో సందడి చేసిన అల్లు అర్జున్ పక్కనే ఉన్నటువంటి తన అత్తగారి ఇంటికి వెళ్లి అక్కడ రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. అయితే చింతపల్లి గ్రామంలో అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అయితే బౌన్సర్లు ఎవరిని కూడా అల్లు అర్జున్ వద్దకు రానివ్వకపోవడంతో కాస్త నిరాశ చెందారు. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగడానికి కూడా ఒప్పుకోకపోవడంతో చాలా దూరం నుంచి తన అభిమాన హీరోని చూడటం కోసం వచ్చిన అభిమానులకు కాస్త నిరాశనే ఎదురయింది. కేవలం అల్లు అర్జున్ సతీమణికి దూరపు బంధువుల పిల్లలతో మాత్రమే అల్లు అర్జున్ ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus